ఒకటి నుంచి పదో తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్తే పదో తరగతికి వచ్చేసరికి పదేళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే తెలుగు మాధ్యమం ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను రెండు భాషల్లో ముద్రిస్తామని, ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియం ఉండేలా చూస్తామన్నారు.
సమస్యలు లేకుండా చట్టం
వర్సిటీల్లో ప్రొఫెసర్స్ ఖాళీలపై కూడా త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుంది. నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు రెండు విధానాలను విద్యాశాఖ సూచించింది. గతంలో మాదిరిగా వర్సిటీల వారీగా చేసుకోవడం, మరొకటి ఉమ్మడిగా ఓ బోర్డు చేపట్టడం. ఏ విధానంలో చేయాలన్నది సీఎస్ అధ్యయనం చేసి నిర్ణయిస్తారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ ఉండగా…మళ్లీ చట్టం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. కమిటీ కూడా పలు సిఫారసులు చేసి న్యాయపరమైన సమస్యలు లేకుండా చట్టం చేయాలని సూచించింది. వాటినీ దృష్టిలో పెట్టుకుని చట్టం తీసుకురాబోతున్నాం.
రూ.3,500 కోట్లతో డెవలప్మెంట్
మన ఊరు- మన బడి పథకం కింద తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం(9,123) పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. అందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తాం. మొత్తం 26,065 బడుల్లో 19.84 లక్షల మంది చదువుతుండగా 9,123 బడుల్లో 65 శాతం విద్యార్థులున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం తప్ప మిగిలిన పనులన్నీ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోపే పూర్తవుతాయి.
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్
అజీమ్ ప్రేమ్జీ వర్సిటీతో కలిసి ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్ కోసం కొన్ని నెలల క్రితమే ఉపాధ్యాయులకు 9 వారాలపాటు శిక్షణ ఇచ్చాం. 1350 మంది శిక్షణ పొందారు. ఈసారి పెద్ద సంఖ్యలో శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో మొత్తం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే వారిలో అనేక మంది ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఒకేసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంపై సమస్యలేమీ ఉండవు. ఎందుకంటే ఇప్పటికే వేలాది బడుల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగుతోంది. గతంలో ఆంగ్ల మాధ్యమంలో చేరిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఆంగ్ల భాషలో మెరుగయ్యారా? లేదా? అని తెలుసుకునేందుకు అధ్యయనం చేయిస్తాం.
అన్ని తరగతులకు ఒకేసారి ఇంగ్లిష్ మీడియం
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS