HomeLATESTవచ్చే ఏడాది నుంచి అన్ని గవర్నమెంట్​ స్కూల్స్​లో ఇంగ్లిష్​ మీడియం

వచ్చే ఏడాది నుంచి అన్ని గవర్నమెంట్​ స్కూల్స్​లో ఇంగ్లిష్​ మీడియం

తెలంగాణ‌లో వచ్చే విద్యా సంవత్సరం (2022 –- 23) ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని గవర్నమెంట్​ స్కూల్స్​లో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి విధి విధానాల రూపకల్పన, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయడంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మార్చి 2న‌ సాయంత్రం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇంగ్లిష్​ మీడియంలో విద్యా బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఆంగ్ల మాధ్యమంలో చేరే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్​; ఉర్దూ, – ఆంగ్లం.. ఇలా ద్విభాష విధానంలో ప్రింట్​ చేయాలని సూచించింది. ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను కమిటీ ఆదేశించింది. విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక మెలకువలు నేర్పేందుకు అవసరమైతే టీ-శాట్‌ ఛానెళ్ల ద్వారా ప్రత్యేక పాఠాలను అందించాలని నిర్ణయించింది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. 2023–24లో 9వ తరగతి, 2024–25లో 10వ తరగతికి ఆంగ్లమాధ్యమం అమలు చేస్తారు.

Advertisement

త్వరలో ఫీజులపై నిర్ణయం

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. దీనిపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.

Advertisement

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

NEWS MIX

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?

ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది....

తెలంగాణ రైతులకు కేసీఆర్ భరోసా.. అదిరిపోయే శుభవార్త

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు...

Telangana New Secretariat తెలంగాణ కీర్తి పతాక: కొత్త సచివాలయం విశేషాలివే

తెలంగాణ పరిపాలనకు గుండె లాంటి సచివాలయం కొత్త రూపును సంతరించుకుంది. తెలంగాణ...

సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం!

భారాస (టీఆర్ఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ లో ఘనంగా...
x
error: Content is protected !!