టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC PAPER LEAK CASE) కేసులో బోర్డు ఛైర్మన్తో పాటు బోర్డు మెంబర్లను విచారించేందుకు సిట్ (Special Investigation Team) సన్నద్ధమవుతోంది. బోర్డు మెంబర్ ప్రొఫెసర్ లింగారెడ్డికి శుక్రవారం ఉదయం సిట్ నోటీసులు జారీ చేసింది. ఇదే రోజు సాయంత్రం బోర్డు సెక్రెటరీ అనితా రామచంద్రన్కు సిట్ నోటీసులు ఇచ్చింది. వీరిద్దరిని శనివారం ఉదయం సిట్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే లింగారెడ్డి పీఏ రమేష్ను సిట్ ఇదే కేసులో అరెస్ట్ చేసింది. సెక్రెటరీ దగ్గర పీఏగా పని చేసిన ప్రవీణ్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా సిట్ గుర్తించింది. అతడిని కూడా అరెస్ట్ చేసింది.
కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మొత్తం 15 మందిని సిట్ అరెస్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు సహా దాదాపు ఇరవై మందిని విచారించింది. విచారణలో భాగంగానే బోర్డు మెంబర్లలో ఒకరైన లింగారెడ్డికి, సెక్రెటరీ అనితా రామచంద్రన్కు నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు ధ్రువీకరించారు. ఇదే వరుసలో ఇతర బోర్డు మెంబర్లను, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరు నియమించారనే కోణంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులతో పాటు సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ ఇచ్చిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగుతోందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
టీఎస్పీఎస్సీ లో ప్రస్తుత బోర్డు మెంబర్లు
- రమావత్ధన్సింగ్
- ప్రొఫెసర్ బండి లింగారెడ్డి
- కొట్ల అరుణ కుమారి
- సుమిత్ర ఆనంద్తనోబ
- కారం రవీందర్రెడ్డి
- అర్వెల్లి చంద్రశేఖర్ రావు
- ఆర్. సత్యనారాయణ