తెలంగాణా పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2020 కి అప్లై చేసుకునే గడువును స్టేట్ టెక్నికల్ బోర్డు మరోసారి పొడిగించింది. గత నెలలో జరగాల్సిన ఈ ఎంట్రన్స్ కరోనా కారణం గా వాయిదా పడింది. వచ్చే నెల ఆగస్ట్ లో ఎంట్రన్స్ నిర్వహించాలని బోర్డ్ భావిస్తోంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఈ ఎంట్రన్స్ తప్పనిసరి. టెన్త్ పాసైన విద్యార్థులందరూ దీనికి అర్హులే. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక విద్యార్థులు ఈసెట్ ఎంట్రన్స్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్ లో చేరే ఛాన్స్ ఉంటుంది. తాజా గడువు ప్రకారం పాలిసెట్ రాసేందుకు జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 300 రూపాయల పెనాల్టీతో ఈ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలకు.. www.polycetts.nic.in