ఇస్రో ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఏటా నిర్వహించే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సారి జియోస్పేషియల్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా నగరాలను సరైన ప్రణాళిక తో నిర్మించే మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేయాలో ఇందులో నేర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ స్కీం లో భాగంగా ఇస్రో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెషనల్స్ కి జియోస్పేషియల్ ఇన్పుట్స్ ఉపయోగించి మాస్టర్ ప్లాన్ తయారు చేసే స్కిల్స్ ఇందులో నేర్పిస్తారు. ఈ నెల 27 నుంచి 31 వరకు డిస్టెన్స్ విధానంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.
అర్హులు
డిగ్రీ, పీజీ చదివినవారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు, ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్ వంటి ఎవరైనా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నెట్, వెబ్ కెమెరా, మైక్రోఫోన్, అవుట్పుట్ స్పీకర్స్ కలిగిన డెస్క్టాప్, ల్యాప్టాప్, ప్రొజెక్టర్ లేదా లార్జ్ టీవీ ఉండాలి.
ప్రోగ్రామ్ స్కిల్స్
అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్, అచీవ్మెంట్స్
జియో స్పేషియల్ టెక్నాలజీస్, డేటా అండ్ అప్లికేషన్స్ ఇన్ అమృత్ ప్రోగ్రామ్
సర్వే టెక్నాలజీస్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ బేస్డ్ డేటా కలెక్షన్ ఫర్ అమృత్
మొబైల్ యాప్స్ అండ్ ఫీల్డ్ డేటా కలెక్షన్
డిజైన్ అండ్ స్టాండార్డ్స్ ఫర్ జియోస్పేషియల్ డేటా క్రియేషన్ అండ్ ఎనేబ్లింగ్ మాస్టర్ ప్లాన్ ఫార్ములేషన్ అండర్ అమృత్
రిజిస్టర్ చేసుకోవాలంటే..
రిజిస్టర్ చేసుకోవాలనుకున్న సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ విభాగాలు, యూనివర్శిటీలు www.iirs.gov.in/Edusat-News/ లింక్ ద్వారా నోడల్ సెంటర్ గా రిజిస్టర్ చేసుకోవాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తమకు సంబంధించిన నోడల్ సెండర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 10 వేల మంది రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రోగ్రామ్ షెడ్యూల్: 2020 జూలై 27 నుంచి 31
వెబ్సైట్: www.iirs.gov.in, www.elearning.iirs.gov.in
ఈమెయిల్: dlp@iirs.gov.in
కోర్సు ఫీజు లేదు.
సులు నిర్వహిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ ఇస్తారు. 70 శాతం అటెండెన్స్, 40 శాతం ఆన్లైన్ ఎగ్జామ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
డిగ్రీ స్టూడెంట్లకు ఇస్రో లెర్నింగ్ ప్రోగ్రామ్.. ఎల్లుండి నుంచే
Advertisement