నీట్ వరంగల్లో
వరంగల్(తెలంగాణ)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) 2020-21 విద్యాసంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రాములో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్; అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి బీటెక్/ బీఈ, డిగ్రీ(ఇంజినీరింగ్)/ ఎంటెక్/ ఎంఈ, ఎంఎస్సీ/ ఎంఫిల్ ఉత్తీర్ణత, గేట్/ యూజీసీ/ సీఎస్ఐఆర్/ నెట్ అర్హత; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. చివరి తేది: జులై 03 వెబ్సైట్: www.nitw.ac.in/
ఏయూసెట్
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏయూసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ( బీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీఏ లిటరేచర్, బీఎల్) ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. ఎగ్జామ్ డేట్: ఆగస్టు 07. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది: జులై 05 వెబ్సైట్: www.andhrauniversity.edu.in/
సీఈఎస్ఎస్లో పీహెచ్డీ
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సీఈఎస్ఎస్) 2020-21 విద్యాసంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రాములో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాలు: ఎకనామిక్స్, సోషియాలజీ/ అంత్రపాలజీ/ సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, జియోగ్రఫీ: అర్హత: ప్రోగ్రామును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణత: వయసు: 30 ఏళ్లు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. పరీక్ష తేది: ఆగస్టు 03. చివరి తేది: జులై 19. వెబ్సైట్: https://cess.ac.in/ph-d-notification-for-the-academic-year-2020-2021/
ఎన్ఐపీజీఆర్లో పీహెచ్డీ…
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రిసెర్చ్(ఎన్ఐపీజీఆర్) 2020-21 విద్యాసంవత్సరానికి ప్రోగ్రాములో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత, సీఎస్ఐఆర్-యూజీసీ నెట్/ డీబీటీ-జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్-నెట్ అర్హత; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ/ వైవా-వాయిస్ ఆధారంగా; ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది: జులై 03 వెబ్సైట్: www.nipgr.ac.in/home/home.php
జేఎన్సీఏఎస్ఆర్లో పీజీడీఎంఎస్
బెంగళూరులోని భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగానికి చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్(జేఎన్సీఏఎస్ఆర్)2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: ఎంఎస్సీ ఉత్తీర్ణత; కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం; సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈమెయిల్: admissions@jncasr.ac.in చివరి తేది: జులై 13 వెబ్సైట్: www.jncasr.ac.in/admit/
కేఆర్యూసెట్
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కేఆర్యూసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్: జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్: అప్లికేషన్ చివరి తేది: జులై 07. వెబ్సైట్: www.krishnauniversity.ac.in/
డబ్ల్యూఐఐలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం
హ్రాదూన్లోని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ)2020 విద్యాసంవత్సరానికి ప్రోగ్రాములో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(నేచురల్ సైన్స్) ఉత్తీర్ణత, ఫారెస్ట్రీ ట్రెయినింగ్, సంబంధిత శాఖలో ఇన్-సర్వీస్లో ఉన్న వారూ అర్హులు. ఈమెయిల్ ద్వారా ఆప్లై చేయాలి. చివరి తేది: జులై 31 వెబ్సైట్: www.wii.gov.in/
ఎయిమ్స్ రిషికేశ్లో..
ఎయిమ్స్ రిషికేశ్ పీహెచ్డీ కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత; అప్లికేషన్ చివరితేది: జూలై 14, వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in
రాజస్థాన్ యూనివర్సిటీలో ఎంపీఈడీ కోర్సులు
రాజస్థాన్ యూనివర్సిటీ ఎంపీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత:బ్యాచిలర్ డిగ్రీ లేదా బీపీఈడీ ఉత్తీర్ణత; ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తులకు చివరితేది: జూలై 15; వెబ్సైట్: www.uniraj.ac.in/
పీహెచ్డీ పీజీ అడ్మిషన్లు
Advertisement