జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచిందింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఫస్ట్ సెషన్ పరీక్షకు 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. రెండో సెషన్ కు 9 లక్షల మంది హాజరయ్యారు. వీటిలో బెస్ట్ స్కోర్ ను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.జేఈఈ మెయిన్ లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
– అభ్యర్థులు ముందుగా jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి.
– హోం పేజీలో కనిపించే JEE(Main) 2023 Session 2 Result లింక్ పై క్లిక్ చేయాలి.
– అనంతరం మీకు మూడు రిజల్ట్స్ లింక్స్ కనిపిస్తాయి. అందులో ఏదో ఓ లింక్ పై క్లిక్ చేయాలి.
– అనంతరం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
– మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రింట్ తీసుకోవాలి.