తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరపు అడ్మిషన్లకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్కు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు డిగ్రీ కాలేజీలకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 255 బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 130 బాలుర కాలేజీలు, 125 బాలికల కాలేజీలు. రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలున్నాయి. వీటిలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. అందులో వచ్చే మార్కుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 16 వ తేదీ వరకూ అప్లికేషన్లకు తుది గడువు ఉంటుంది. ఏప్రిల్ 29 వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCW) సెక్రెటరీ డాక్టర్ మల్లయ్య బట్టు ప్రకటన విడుదల చేశారు.
ఆన్లైన్ లో అప్లికేషన్ల నమోదుకు డైరెక్ట్ లింక్ http://mjptbcwreis.telangana.gov.in/