HomeLATESTమహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో అడ్మిషన్స్​

మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో అడ్మిషన్స్​

హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022- – 23 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో (ఇంగ్లిష్‌ మీడియం) అడ్మిషన్స్​కు అర్హులైన బాల, బాలికల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement

అర్హత: ఆరో తరగతి విద్యార్థులు ఐదో తరగతిలో, ఏడో తరగతి అభ్యర్థులు ఆరో తరగతిలో, ఎనిమిదో తరగతి అభ్యర్థులు ఏడో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. 2022- – 21, 2021 – -22 సంవత్సరాల్లో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో ఏడాదికి రూ.1,50,000, పట్టణాల్లో ఏడాదికి రూ.2,00,000 మించకూడదు.

వయసు: 31 ఆగస్టు 2022 నాటికి ఆరో తరగతి విద్యార్థులు 12 ఏళ్లు, ఏడో తరగతి విద్యార్థులు 13 ఏళ్లు, ఎనిమిదో తరగతి విద్యార్థులు 14 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంట్రన్స్​ టెస్టులో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్​ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.100 చెల్లించాలి. జూన్​ 19వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.mjptbcwreis.telangana.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!