HomeFeaturedBANK EXAMS6432 పోస్టులకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్

6432 పోస్టులకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement


బ్యాంకుల వారీగా ఖాళీలు: మొత్తం 6432 ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 535, కెనరా బ్యాంక్​లో 2500, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 500, పంజాబ్ సింధ్ బ్యాంక్​లో 253, యూకో బ్యాంక్ లో 550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2094 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 1 ఆగస్టు 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2 నుంచి 22 వరకు అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​ ప్రిలిమ్స్​ పరీక్ష అక్టోబర్​లో నిర్వహించనున్నారు. రిజల్ట్స్​ నవంబర్​లో విడుదల చేస్తారు. మెయిన్స్​ పరీక్ష నవంబర్​లో నిర్వహించి డిసెంబర్​లో ఫలితాలు రిలీజ్​ చేస్తారు. అందులో ఎంపికైన​ అభ్యర్థులకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఫలితాలు ఏప్రిల్​ 2023లో వెల్లడిస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్​సైట్​లో చూసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!