Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆగస్ట్ 29, 30 తేదీల్లోనే గ్రూప్​ 2 ఎగ్జామ్​.. స్కూళ్లు కాలేజీలకు సెలవులు

ఆగస్ట్ 29, 30 తేదీల్లోనే గ్రూప్​ 2 ఎగ్జామ్​.. స్కూళ్లు కాలేజీలకు సెలవులు

గ్రూప్​ 2 ఎగ్జామ్​ ఆగస్ట్ 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (OMR) పద్ధతిలోనే ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ వెల్లడించింది. ఆగస్టు 29, 30వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం 783 గ్రూప్​ 2 ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్ట్​కు 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇటీవలే సమీక్ష జరిపారు.

Advertisement

పరీక్ష జరిగే ఎగ్జామ్​ సెంటర్లకు హాలీడే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కాలేజీ ఎడ్యుకేషన్​, స్కూల్​ ఎడ్యుకేషన్​, ఇంటర్‌ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!