సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 1000 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో ఆఫీసర్గా మూడేళ్ల పని అనుభవం ఉండాఇ. లేదా పీఎస్బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో క్లర్క్గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి 32 ఏళ్లు మించకూడదు. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. ఈ పోస్టుల పే స్కేల్ రూ.48 వేల నుంచి రూ.69 వేల వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: ఆగస్ట్ రెండు/ మూడో వారం, 2023.