HomeLATESTటెన్త్​, ఇంటర్​ ఎగ్జామ్స్‌ ప్యాటర్న్‌లో మార్పుల్లేవ్​: సీబీఎస్​ఈ

టెన్త్​, ఇంటర్​ ఎగ్జామ్స్‌ ప్యాటర్న్‌లో మార్పుల్లేవ్​: సీబీఎస్​ఈ


టెన్త్​, ఇంటర్​ విద్యార్థుల ఎగ్జామ్​ ప్యాటర్న్​లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్​ఈ) ప్రక‌టించింది. గ‌త ఏడాది జూలైలో ప్రక‌టించిన ప్యాటర్న్‌ ప్రకార‌మే సీబీఎస్​ఈ ట‌ర్మ్-2 ప‌రీక్షలు జ‌రుగుతాయ‌ని స్పష్టంచేసింది. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ట‌ర్మ్‌-2 ప‌రీక్షల కోసం సిల‌బ‌స్‌ను హేతుబ‌ద్దీక‌రించామ‌ని, త‌ర్వాత జ‌రుగ‌బోయే ప‌రీక్షల కోసం అప్పటి క‌రోనా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపింది.

పాత సిలబస్​ ప్రకారమే ప్రిపేరవ్వాలి

సిల‌బ‌స్, ఎగ్జామ్స్ ప్యాట‌ర్న్ విష‌యంలో తదుప‌రి నిర్ణయం తీసుకునే వ‌ర‌కు విద్యార్థులు పాత ప్యాట‌ర్న్, రేష‌న‌లైజ్ చేసిన సిల‌బ‌స్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌రీక్షల‌కు ప్రిపేర్ కావాల‌ని సీబీఎస్ఈ సూచించింది. ఇటీవ‌ల సీబీఎస్​ఈ10వ‌, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షల ప్యాట‌ర్న్‌ను మార్చబోతున్నద‌ని ప్రచారం జ‌రిగింది. దాంతో విద్యార్థులు ఏ ప్యాట‌ర్న్ ప్రకారం ప‌రీక్షల‌కు స‌న్నద్ధం కావాల‌నే విష‌యంలో కొంత అయోమ‌యానికి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో సీబీఎస్​ఈ విద్యార్థుల అయోమ‌యానికి తెర‌దించుతూ స్పష్టమైన ప్రక‌ట‌న చేసింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!