HomeLATESTఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో 8700 టీచర్‌ పోస్టులు

ఆర్మీ పబ్లిక్​ స్కూల్స్​లో 8700 టీచర్‌ పోస్టులు

టీచర్​ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్​ స్కూళ్లలో 8700 పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్​టీ టీచర్​ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్​ ఎడ్యుకేషన్​ సొసైటీ ఈ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో పోస్ట్​ గ్రాడ్యుయేట్​, ట్రెయిన్డ్​ గ్రాడ్యుయేట్, ప్రైమరీ టీచర్​ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆన్​లైన్​ స్క్రీనింగ్​ టెస్ట్​, ఇంటర్వ్యూ, టీచింగ్​ స్కిల్స్​, కంప్యూటర్​ ప్రొఫిషియేన్సీ టెస్ట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పీజీటీ టీచర్​ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి,

టీజీటీ పోస్టులకు 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ టీచర్​ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్​, డీఈడీ లేదా బీఈడీ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. కనీసం ఐదేళ్ల టీచింగ్​ అనుభవం ఉండాలి.

ఈ ఏడాది ఏప్రిల్​ ఒకటో తేదీ నాటికి 40 ఏళ్లు మించకుండా వయసు ఉండాలి.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో 385 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించి జనవరి 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. స్కినింగ్​ టెస్ట్​ ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. .


మొత్తం ఖాళీలు: 8700

పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ).

అర్హత:

1) పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.

2) ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌, బీఈడీ ఉత్తీర్ణత.

3) ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌, రెండేళ్ల డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)/ బీఈడీ ఉత్తీర్ణత.

వయసు: ఫ్రెష్‌ అభ్యర్థులు 1 ఏప్రిల్​ 2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్‌ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఓఎస్‌టీ), ఇంటర్వ్యూ, టీచింగ్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.



ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో (ఎంసీక్యూ) ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు.

ఆన్​లైన్​ స్కీనింగ్​ టెస్ట్​ మల్టిపుల్​ ఛాయిస్​ విధానంలో పార్ట్​–ఏ, పార్ట్​–బి రెండు సెక్షన్లలో ఉంటుంది.
పార్ట్​–ఏలో మొత్తం 80 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్​ నాలెడ్జ్​ నుంచి 28 ప్రశ్నలు, కరెంట్​ అఫైర్స్ నుంచి 28 ప్రశ్నలు, ప్రొఫెషనల్​ నాలెడ్జ్​ సంబంధించి 24 ప్రశ్నలు ఇస్తారు.

పార్ట్​–బిలో 120 ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు సంబంధించి ప్రైమరీ, టీజీటీ పోస్టులకు ఆరో తరగతి నుంచి 10వ తరగతి స్థాయి సిలబస్​, పీజీటీ పోస్టులకు 6వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి సిలబస్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్​ మార్కులు ఉంటాయి. నాలుగు తప్పులకు ఒక మార్కు కట్​ చేస్తారు.

ఆన్​లైన్​ స్క్రీనింగ్​ టెస్ట్​లో అర్హత సాధించిన వారికి స్టేజ్​–2లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. స్టేజ్​–3లో టీచింగ్​ స్కిల్​, కంప్యూటర్​ ప్రొఫిషియన్సీ టెస్ట్​ నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.



దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: రూ.385 చెల్లించాలి.

చివరి తేది: 28 జనవరి 2022.

హాల్​టికెట్స్: 10 ఫిబ్రవరి 2022 నుంచి అందుబాటులో ఉంచుతారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌: 19, 20 ఫిబ్రవరి
వెబ్​సైట్​: www.awesindia.com

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!