సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైన్యంలో చేరేందుకు ఆహ్వానిస్తోంది. 72 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టు అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం : నవంబర్ 15
చివరి తేదీ: డిసెంబర్ 29
ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్: డిసెంబర్ 29
ఎగ్జామ్: త్వరలో ప్రకటిస్తారు
అర్హత
బీఎస్ఎఫ్ విడుదల చేసిన ఈ గ్రూప్ సీ పోస్టుల కోసం అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలి. దాంతో పాటు అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు18 ఏళ్లకు పైబడిన వాళ్లు… 25 ఏళ్ల లోపు వాళ్లు దరఖాస్తు చేసువచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, ఎక్స్ సర్వీస్ పీపుల్కు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
అప్లికేషన్లో చెప్పిన అర్హతలు ఉన్న వ్యక్తులు www.rectt.bsf.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. అ వెబ్సైట్లోనే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.
వెబ్సైట్: www.rectt.bsf.gov.in