రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యా సంవత్సరం(2022-–23) నుంచి ఎంసెట్ ర్యాంకు. ఆధారంగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కాళోజీ యూనివర్సిటీ భర్తీ చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్లో వచ్చే మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి 87 నర్సింగ్ కాలేజీలున్నాయి. సుమారు అయిదు వేల వరకు సీట్లున్నాయి.
నీట్ అధారంగా నర్సింగ్ సీట్లు కేటాయించవచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ విద్యా సంవత్సరం(2021–-22) నుంచి అమలు చేయాలని సూచించింది. ఒకవేళ నీట్ ద్వారా కాకపోయినా.. ఏదో ఒక ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కానీ కాళోజీ యూనివర్సిటీ ఈ ఏడాదికి మినహాయింపు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరుపుతోంది.
అందుకే.. వచ్చే ఏడాది నుంచి మన రాష్ట్రంలో ఎంసెట్ ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయాలని భావిస్తోంది. ఇటీవల హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధ్వర్యంలో జరిగిన వీసీల మీటింగ్లో ఈ చర్చ జరిగింది. నీట్, ఎంసెట్లో దేని ఆధారంగా సీట్లను భర్తీ చేయాలనేది మీటింగ్లో డిసైడ్ కాలేదు. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్. కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటామని కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి. చైర్మన్ అర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ ద్వారా నర్సింగ్ సీట్ల భర్తీ
Advertisement