ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. గతేడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం సెకండియర్కు ప్రమోట్ చేసింది. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
Advertisement