బాసర ట్రిపుల్ ఐటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ అడ్మిషన్ల దరఖాస్తు తేదిని పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 వరకు చివరి తేది ఉండగా.. భారీ వర్షాల కారణంగా 20వ తేది వరకు పొడిగించినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. వికలాంగులు, స్పోర్ట్స్, ఇతర విద్యార్థుల అప్లికేషన్స్ ఈ నెల 19 వరకు ఉండగా.. 25 తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు. టెన్త్ మార్కుల గ్రేడ్ల ఆధారంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో సీట్లను భర్తీ చేస్తారు. ట్రిపుల్ ఐటీలో జాయిన్ కావాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవాలంటే.. అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ అందబాటులో ఉంది.
https://admissions.rgukt.ac.in/adm/ug
ట్రిపుల్ ఐటీ అప్లికేషన్స్ డేట్ పొడిగింపు
Advertisement
When results will be declared sir