బ్యాంక్ నోట్ ప్రెస్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలు ఇంక్ ఫ్యాక్టరీ, ప్రింటింగ్, ఎలక్ట్రికల్ లేదా ఐటీ విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైనవారు మధ్యప్రదేశ్లోని దేవాస్లో పనిచేయాలి.
అర్హతలు: ఐటీఐలో డిప్యూటీ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ, పర్ఫేస్ కోటింట్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రో ప్లాటింగ్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిముషాల పాటు పరీక్ష రాయాలి. టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కు రూ.200 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్లో మార్చి 28 వరకు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ రాతపరీక్ష ఏప్రిల్/మే నెలలో ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.bnpdewas.spmcil.com వెబ్సైట్ సంప్రదించాలి.