HomeLATESTజేఈఈ మెయిన్స్​ షెడ్యూల్‌ రిలీజ్​.. రెండు విడతల్లో ఎగ్జామ్​

జేఈఈ మెయిన్స్​ షెడ్యూల్‌ రిలీజ్​.. రెండు విడతల్లో ఎగ్జామ్​

జేఈఈ మెయిన్స్​ షెడ్యూల్​ నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) రిలీజ్​ చేసింది. దేశంలోని ఎన్‌ఐటీల్లో అడ్మిషన్స్​కు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అర్హుల్ని నిర్ణయించేందుకు ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్‌; మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ డా. సాధనా పరాషర్‌ వెల్లడించారు. విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

జులై 3న జేఈఈ అడ్వాన్స్​డ్​ ఎగ్జామ్​

ఐఐటీల్లో బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ ఇంతకుముందే రిలీజ్​ చేశారు. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఈ పరీక్ష నిర్వహిస్తున్న బాంబే ఐఐటీ గురువారం సమగ్ర వివరాలతో బ్రోచర్‌ విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు జూన్‌ 8 నుంచి జూన్‌ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్‌ మొదలవుతుందని వివరించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!