జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. దేశంలోని ఎన్ఐటీల్లో అడ్మిషన్స్కు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అర్హుల్ని నిర్ణయించేందుకు ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్; మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ డా. సాధనా పరాషర్ వెల్లడించారు. విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
జులై 3న జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్
ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ ఇంతకుముందే రిలీజ్ చేశారు. జులై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఈ పరీక్ష నిర్వహిస్తున్న బాంబే ఐఐటీ గురువారం సమగ్ర వివరాలతో బ్రోచర్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించే విద్యార్థులు జూన్ 8 నుంచి జూన్ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ మొదలవుతుందని వివరించింది.
