ఏపీలో టెన్త్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫలితాలపై కీలక అప్టేట్ ఇచ్చారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు స్పాట్ వాల్యూయేషన్ 44 శాతం పూర్తియనట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. నిన్న పలు ప్రాంతాల్లో జరిగిన స్పాట్ వాల్యూయేషన్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ వరకు వాల్యూయేషన్ పూర్తవుతుందన్నారు. మే 2వ వారంలో ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు.
Advertisement