తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల పై కీలక సమాచారం వచ్చేసింది. పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్ కూడా రానే వచ్చింది. సాధ్యమైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించాలని ఇంటర్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. ఫలితాలు విడుదల అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని, ఇటువంటి ప్రచారాన్ని విద్యార్థులు నమ్మవద్దని చెప్పింది. ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీని నిర్ణయించలేదని తెలిపింది. ఫలితాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. మే 10 తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో ఇంటర్ ఫలితాలను మరో 4 రోజుల్లో విడుదల చేయాలని ఏపీ ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. ఇప్పటికే వాల్యూయేషన్ కూడా పూర్తి కావడంతో.. టేబులేషన్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న ఫలితాలు విడుదల అవుతాయని వివిధ కాలేజీల యాజమాన్యాలు స్టూడెంట్స్, పేరెంట్స్ కు సమాచారం ఇస్తున్నాయి. గత నెల మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహించింది.