ఢిల్లీలోని ప్రముఖ ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ మేరకు నార్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్ సెట్)-4 ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమైంది.
దరఖాస్తు చేసుకోవడానికి మే 05ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను aiimsexams.ac.in వెబ్ సైట్లో సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 3055 ఖాళీలకు గాను ఎయిమ్స్ బీబీ నగర్ లో 150, ఎయిమ్స్ మంగళగిరిలో 117 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: డిప్లొమా (GNM)తో పాటు రెండేళ్ల అనుభవం/బీఎస్సీ (ఆనస్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్/బీఎస్సీ (పోస్టు స్టిఫికేట్)/పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా అభ్యర్థులు స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.