బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆప్ బరోడాలో ఎంఎస్ఎస్ఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, అసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కావాల్సిన అర్హతలు, వయోపరిమితి, జీతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఎంబీఏ పాస్ అయి పని అనుభవం ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
వయస్సు:
01-12-2023 28 నుంచి 37ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
జీత భత్యాలు:
ఈపోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,840 నుంచి 78, 230 వరకు చెల్లిస్తారు.
పోస్టింగ్:
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాల్లో, శాఖాల్లో పోస్టులను కేటాయిస్తారు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక విధానం పూర్తిగా ఆన్ లైన్ ద్వారా ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష, సైకో మెట్రిక్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ , ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 100చెల్లించాలి.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ 26 డిసెంబర్ 2023.