HomeLATESTగ్రూప్​ 3 అభ్యర్థులకు అలర్ట్.. 21 వరకు ఛాన్స్​

గ్రూప్​ 3 అభ్యర్థులకు అలర్ట్.. 21 వరకు ఛాన్స్​

గ్రూప్​ 3 అభ్యర్థులకు టీఎస్​పీఎస్​సీ మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు, వివరాల డేటాలో తప్పులుంటే సరిదిద్తుకోవాలని టీఎస్​పీఎస్​సీ సూచించింది. అఫిషియల్​ వెబ్​సైట్​లో ఉన్న ఎడిట్​ ఆఫ్షన్​ లింక్​ క్లిక్​ చేసి అభ్యర్థులు తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం 1388 గ్రూప్​ 3 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ గ్రూప్​ 3 నోటిఫికేషన్​ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ముగిసింది. ఈ పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్​పీఎస్​సీ ఇప్పటికే ప్రకటించింది. పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్​ మూడు నాలుగు వారాల్లో పరీక్ష తేదీలుండేలా టీఎస్​పీఎస్​సీ ఇప్పటికే షెడ్యూలు తయారు చేసుకుంది. కానీ.. గ్రూప్​ 2 వాయిదా నడటం, నవంబర్​ 2,3 తేదీలకు రీషెడ్యూలు చేయటంతో గ్రూప్​ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే సందిగ్ధత నెలకొంది. గ్రూప్​ 2 కంటే ముందే అక్టోబర్​లో గ్రూప్​ 3 పరీక్ష ఉంటుందా..? లేదా గ్రూప్​ 2 తర్వాత నిర్వహిస్తారా.. అనేది ఎడిట్ ఆఫ్షన్​ ప్రక్రియ ముగిసన తర్వాత టీఎస్​పీఎస్​సీ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!