రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత ప్రారంభమైన భారీ నియామక ప్రక్రియలో పోలీస్ జాబ్స్ ఒకటి. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు పోటీ పడ్డారు. మెయిన్స్ ఎగ్జామ్ సైతం ముగియడంతో ఫలితాలను విడుదల చేస్తోంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. తాజాగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసింది.
సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా:
ఇతర విభాగాల్లో ఎంపికైన వారి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు.
మొత్తం 587 పోస్టులకు గాను 434 మంది పురుష అభ్యర్థులు, 153 మంది మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కట్ ఆఫ్ మార్కుల వివరాలను TSLPRB వెబ్ సైట్లో (https://www.tslprb.in/) అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించేందుకు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు గడువు ఇచ్చారు.