తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు TREIRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 17 జిల్లాలలో 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్ట్లలో జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టులకు గాను 2,63,045 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. ఉదయం 8:30-10:30 వరకు, మధ్యాహ్నం 12:30-2:30 వరకు, సాయంత్రం 4:30-6:30వరకు పరీక్ష జరుగుతుంది.
రెండు మూడు పోస్టులకు పరీక్షలు రాసేవారు తమ హల్ టికెట్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారన్న విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 30నిమిషాల ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఫోటో ఐడి కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని కన్వీనర్ మల్లయ్య బట్టు తెలిపారు. ప్రశ్నా పత్రం ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను పరీక్ష ప్రారంభం కావడానికి 10నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారు.