తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు తాజాగా విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. ప్రిలిమ్స్ లో పాసై ఈవెంట్స్ కు హాజరుకాని గర్భిణీ, ఇటీవల డెలివరీ అయిన మహిళా అభ్యర్థులకు ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులు.. ఫైనల్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాల్లో తాము అర్హత సాధిస్తే.. రిజల్ట్స్ విడుదలైన నెలరోజుల్లో ఈవెంట్స్ లో పాల్గొని అర్హత సాధిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మెడికల్ బోనఫైడ్ సర్టిఫికేట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ సర్టిఫికేట్ల సమర్పణకు జనవరి 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. O/o the Director General of Police, Telangana State, Lakdi-ka-pul, Hyderabad చిరునామాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో ఈ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ప్రిలిమ్స్ పరీక్ష పాసై.. పార్ట్-2 దరఖాస్తులను సమర్పించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది.