కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 4014 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీతో పాటు సెక్షన్ ఆఫీసర్ పోస్టులున్నాయి.
బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. టీచింగ్ పోస్టులకు తప్పనిసరిగా సీటెట్ క్వాలిఫై ఉండాలి. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 16వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు https://kvsangathan.nic.in/ అఫిషియల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.