వేసవి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో 8 స్పెషల్ ట్రైన్లను (Summer Special trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07153: నరసాపూర్-SMVT బెంగళూరు ట్రైన్ ను మే 5 నుంచి 26వ తేదీ వరకు నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07154: SMVT బెంగళూరు-నరసాపూర్ ట్రైన్ ను మే 6వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ప్రతీ శనివారం 10.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.