దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2024) ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పరీక్ష మే 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మిషన్స్కు ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. నీట్ యూజీ సిలబస్లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా వివరాలను ప్రకటించింది.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1,000 చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం www.neet.ntaonline.in వెబ్సైట్లో సంప్రదించాలి.