ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడింది. జులై 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-47వ కోర్సుకు ఇండియన్ ఆర్మీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియమిస్తారు.
ఖాళీలు: 90
కోర్సు ప్రారంభం: జులై 2022 .
కనీసం 60శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. జేఈఈ (మెయిన్స్) 2021 పరీక్షకి హాజరై ఉండాలి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. 02 జనవరి 2003 – 01 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్: షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిల్ వస్తోంది. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 విభాగాలు ఉంటాయి. స్టేజ్-1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 2022 నుంచి.
ఆన్లైన్ అప్లికేషన్స్కు చివరితేది: 23 ఫిబ్రవరి
వెబ్సైట్: www.joinindianarmy.nic.in