గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇక నుంచి APPSC నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ (CPT)ని తప్పనిసరి చేసింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ) పాస్ కావాల్సిందేనని సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది జగన్ సర్కార్.
100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC,ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు సాధించాలని తెలిపింది. ఇంకా.. బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాలని పేర్కొంది. మారిన పరిస్థితులు, ప్రతీ పనిలో కంప్యూటర్ వినియోగం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.