దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సెప్టెంబర్1 నుండి డిగ్రీ క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. జులై 1 నుండి 13 వరకు ఫస్ట్ ఫేస్ దోస్త్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
దోస్త్ నోటిఫికేషన్ 2020
జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం
జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
దరఖాస్తు చేయాలంటే.. ఈ లింక్పై క్లిక్ చేయండి.. https://dost.cgg.gov.in/