HomeLATESTగ్రూప్​ 2 వాయిదా వేయండి.. సీఎం కేసీఆర్​

గ్రూప్​ 2 వాయిదా వేయండి.. సీఎం కేసీఆర్​

గ్రూప్​ 2 పరీక్ష వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీఎస్​పీఎస్​సీతో సమాలోచనలు జరిపి తదుపరి పరీక్షల తేదీని ఖరారు చేయాలని సూచించారు. లక్షలాది మంది అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సీఎస్​ను ఆదేశించారు. అన్ని ఉద్యోగ నియామకాలకు అభ్యర్థులు ప్రిపేరయ్యేలా తగినంత వ్యవధి ఉండేలా పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. లక్షలాది మంది అభ్యర్థుల ఆందోళనపై సీఎం స్పందించిన విషయాన్ని మంత్రి కేటీఆర్​ ట్వీటర్​ ద్వారా ప్రకటించారు. దీంతో సీఎస్​ శాంతి కుమారి రేపు ఉదయం టీఎస్​పీఎస్​సీ అధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం ఆదేశాలతో గ్రూప్​ 2 పరీక్ష రీషెడ్యూలు కానుంది. తిరిగి నవంబర్​లో పరీక్ష జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!