ఆంధ్రప్రదేశ్ లో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల (AP Police Constable Jobs) భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను జనవరి 22న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించగా.. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులకు గాను.. 4,58,219 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 2న అంటే.. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే రిజల్ట్స్ ను విడుదల చేసి సంచలనం సృష్టించింది బోర్డ్. ఈ ఫలితాల్లో 95,208 మంది మాత్రమే తదుపరి దశ అయిన.. ఈవెంట్స్ కు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన కాల్ లెటర్లను మార్చి 1న విడుదల చేయనున్నట్లు బోర్డు తాజాగా వెల్లడించింది. అభ్యర్థులు మార్చి 1 నుంచి 10వ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.
ఈ ఫిజికల్ టెస్ట్ లను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపింది. మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ మొదటి వారంలో నిర్ణయించాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.