కేంద్రహోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూర్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 362 సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్ పోర్ట్, 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కలిపి మొత్తం 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో విజయవాడ ఇంటెలిజెన్స్ బ్యూరోకు 17, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూర్ కు 15 పోస్టులు కేటాయించారు. 677పోస్టుల్లో అన్ రిజర్వ్డ్ 404, ఓబీసీలకు 125, ఎస్సీలకు 34, ఎస్టీలకు 55, ఈడబ్య్లూఎస్ లకు 59కేటాయించారు.
ఇది కూడా చదవండి: ఏపీ వర్సిటీల్లో 3,282 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు 27ఏళ్లలోపు ఉండాలి. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్యపరీక్ష ఆధారంగా సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ఏ, ఎంటీ, ఎంటీఎస్ అభ్యర్థులకు ఆన్ లైన్ టెస్టు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, కాకినాడ, తిరుపతి, విశాఖ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ , వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఐదింటిని దరఖాస్తు సమయంలో సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 13. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ www.mha.gov.inలో చెక్ చేసుకోవచ్చు.