UPSC CDS పరీక్ష II 2023 కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం.. మొత్తం 349 మంది అభ్యర్థులు ఇండియన్ మిలిటరీ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి ఎంపిక చేయబడతారు. ఇండియన్ మిలిటరీ ఇన్స్టిట్యూట్లలోని వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులు జూలై 2024లో ప్రారంభమవుతాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ II, 2023 నోటిఫికేషన్ చూడటానికి.. ఈ వెబ్సైట్ను upsc.gov.in.సందర్శించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 17 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 6 గంటల లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
– ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ – 100
– ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమల – 32
– ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ – 32
– ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్) 120వ SSC (పురుషుడు) (NT) – 169
– ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్) 34వ SSC ఉమెన్ (NT) – 16
మొత్తం – 349 పోస్ట్లు
విద్యార్హతలు
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు..
UPSC CDS పరీక్ష II, 2023కి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు రూ. 200 రుసుము చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ఇలా..
UPSC CDS పరీక్ష II, 2023 కోసం అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. పరీక్షకు మూడు వారాల ముందు ఈ-అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి.