గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఓఎంఆర్ షీట్లు ఈ రోజు విడుదల కావడంతో ప్రైమరీ కీ కూడా ఈ రోజే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జులై 1న తెలంగాణలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పరీక్షను నిర్వహించగా 7.61 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-4 ఓఎంఆర్ షీట్స్ డౌన్ లోడ్ లింక్-LINK
దీని కోసం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ 4 పేపర్-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Group4