HomeLATESTగ్రూప్​ 2,3 లో పెరగనున్న పోస్టులు… ఖాళీలు కోసం ఆదేశాలు

గ్రూప్​ 2,3 లో పెరగనున్న పోస్టులు… ఖాళీలు కోసం ఆదేశాలు

గ్రూప్​ 2,3 పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇంతకు ముందు విడుదల చేసిన గ్రూప్​2 పరీక్షలో 783, గ్రూప్​ 3 లో 1388 పోస్టులు ఉండగా, అవి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వివిధ శాఖలకు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలను గుర్తించాలని సూచించింది. ఈ వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విభాగాధిపతులకు లేఖ రాశారు. ఈ ఏడాదిలో జరగనున్న గ్రూప్ 2, 3 పోస్టుల రాతపరీక్షలకు ముందుగానే అదనపు ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని, పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు ఉద్యోగార్థులు భావిస్తున్నారు. 2022లో నోటిఫై చేసిన గ్రూప్2 పోస్టులు ప్రస్తుతం 783 ఉన్నాయి. ఈ పోస్టులకు రాతపరీక్షల తేదీలు గత ఏడాది నుంచి మూడుసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 3లో 1388 పోస్టులకు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ షెడ్యూలు ఖరారు చేసింది.

Advertisement

ఉద్యోగాలు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్

ప్రస్తుత నోటిఫికేషన్లలోనే ఉద్యోగాల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు జరిగే వరకు పోస్టుల సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నట్లు కమిషన్ ప్రభుత్వం భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురయ్యే న్యాయసమస్యలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఈక్రమంలో వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలతో పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే వచ్చే అదనంగా వచ్చే పోస్టులపైనా కూడా కసరత్తు జరుగుతోంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!