HomeLATESTముగిసిన గ్రూప్-2 దరఖాస్తులు.. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

ముగిసిన గ్రూప్-2 దరఖాస్తులు.. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గడువు ముగిసే సమయం వరకు మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే.. గ్రూప్-2 దరఖాస్తు గడువును సైతం పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది.

Advertisement

కానీ.. టీఎస్పీఎస్సీ మాత్రం ముందు ప్రకటించిన గడువు వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించింది. ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా దరఖాస్తు ప్రక్రియ సాగడంతో గడువును పొడిగించలేదని సమాచారం. గ్రూప్-2 కింద మొత్తం 783 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 165, మండల పంచాయతీ అధికారి 126, నాయిబ్ తహసీల్దార్ 98, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 97 తదితర పోస్టులు ఉన్నాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!