తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో త్వరలో మరో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్లేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది బాలింతలు, గర్భిణులకు న్యూట్రీషియన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.