బీసీ గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ప్రవేశ పరీక్షను ఈనెల 30న నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లో 22,400 సీట్లు ఉండగా 58,113 దరఖాస్తులు వచ్చాయన్నారు. డిగ్రీలో 4560 సీట్లు ఉండగా 8,429 దరఖాస్తులు వచ్చాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా 277 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని, అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని మల్లయ్య భట్టు సూచించారు.