దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న జాబ్స్ లో రైల్వే జాబ్స్ ఒకటి. తాజాగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణ రైల్వే (Southern Railway) నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే.. అంటే ఈ నెల 5వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు: బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://rrcmas.in/
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
Raju