తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. 18 స్పెషల్ ట్రైన్లను (Ganga Pushkaram Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, గుంటూరు, తిరుపతి నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07007: సికింద్రాబాద్-రక్సౌల్ ట్రైన్ ను ఈ నెల 23, 30, మే 7న నడపనున్నట్లు తెలిపింది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 10.30 గంటలకు బయలుదేరి.. రెండో రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07008: రక్సౌల్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఏప్రిల్ 25, మే 2, 9 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ 19.15 గంటలకు బయలుదేరి.. రెండో రోజు 14.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07419: తిరుపతి-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 22, 29, మే 6న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Train No.07420: ధన్ పూర్-తిరుపతి ట్రైన్ ను ఏప్రిల్ 24, మే 1, 8 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Train No.07230: గుంటూరు-బనారస్ ట్రైన్ ను ఏప్రిల్ 22, 29 మరియు మే 6 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.07230: గుంటూరు-బనారస్ ట్రైన్ ను ఏప్రిల్ 22, 29 మరియు మే 6 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.