భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 120 ఆపరేషన్(100 పోస్టులు), ఎలక్ట్రికల్(20 పోస్టులు), తదితర విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు మించకూడదు.
అభ్యర్థుల ఎంపిక:
అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 55,000 వేల వేతనం ఉటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులు రూ.300 ఫీజు చేల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో మే 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://www.ntpc.co.in/