నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి అర్హతతో త్వరలోనే భారీ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ, ఎస్ఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్, ఎన్ సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీతో పూర్తి అవుతుంది. రాత పరీక్ష తేదీలను ఎస్ ఎస్సీ ఈ మధ్యే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేసింది. కానిస్టేబుల్ రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20,21,2,2,23,24,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతాయని వెల్లడించింది.
కాగా గతేడాది నవంబర్ లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సాయుధ బలగాల్లో 50వేలకు పైగానే సిపాయి పోస్టులు భర్తీ చేశారు. ఈ ఏడాది కూడా అంత కంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ కానున్నాయి.
ఇది కూడా చదవండి: ఎయిర్ పోర్టు అథారిటీలో 496 ఉద్యోగాలు