దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరిగింది.. దీని ద్వారా మొత్తం 6414 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇంటర్వ్యూ ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్ అధికారి వెబ్ సైట్లో పొందుపరిచారు. రాతపరీక్ష క్లాస్ డెమో ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు సెలక్ట్ అయితే రూ. 35 వేల నుంచి రూ. 1,12,00వరకు వేతనం అందుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.