ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 29న మహిళా జాబ్మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మహిళా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ మేళాను ఏర్పాటు చేశారు. రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్ఫూరెన్స్ కంపెనీ తమ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తోంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 29 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీ ఉదయం యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆఫీసులో నిర్వహించే జాబ్ మేళాకు నేరుగా హాజరు కావాలని ఓయూ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ రాము ఒక ప్రకటనలో తెలిపారు.