డీఎస్సీ 2023 సిలబస్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్తో పాటు భాషా పండితులకు సంబంధించిన సిలబస్ను ప్రకటించింది. పూర్తి వివరాల సిలబస్ను అభ్యర్థుల కోసం ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం. పీడీఎఫ్ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
100 మార్కులుండే పరీక్షలో 20 మార్కులను టెట్ లో వచ్చిన స్కోర్కు వెయిటేజీగా పరిగణిస్తారు. ఎస్జీటీ పోస్టులకు జనరల్ నాలెడ్జీ- కరెంట్ అఫైర్స్కు 10 మార్కులు. విద్యాదృక్పథాలకు 20, ఫస్ట్ లాంగ్వేజీకి 9, ఇంగ్లీషుకు 9, మ్యాథ్స్కు 9, సామాజిక శాస్త్రం 9, విజ్ఞాన శాస్త్రానికి 9, టీచింగ్ మెథడాలజీకి 15 మార్కులు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్, ల్యాంగ్వేజీ పండిట్ పోస్టులకు జనరల్ నాలెడ్జి- కరెంట్ అఫైర్స్ 10, విద్యా దృక్పథాలకు 10, కంటెంట్కు 44, టీచింగ్ మెథడాలజీకి 16 మార్కులను కేటాయించారు.
డీఎస్సీ కొత్త సిలబస్పై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్జీటీకి 10 వ తరగతి స్థాయి వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఇంటర్ స్థాయి వరకు సిలబస్ పెంచారు. గతంలో ఇది 8వ తరగతి, టెన్త్ వరకే ఉండేది. సిలబస్ పెరగటంతో ప్రిపరేషన్కు టైమ్ సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యా దృక్పథాలు టాపిక్ లో టెట్ లో ఇచ్చే సైకాలజీ జత చేయటం సరికాదని అంటున్నారు. పాత సిలబస్ను కొనసాగించాలని డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.